తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల (Tirumala ) వేంకటేశ్వరస్వామి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు కలిగిన భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 58,100 మంది భక్తులు దర్శించుకోగా 20,817 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లు వచ్చిందన్నారు.