ఈ ఏడాది ఐపీఎల్లో తన యాటిడ్యూడ్తో అభాసుపాలైన ఆటగాడు రియాన్ పరాగ్. స్పెషలిస్టు ఫినిషర్గా రాజస్థాన్కు ఆడిన అతను అత్యంత పేవలమైన ఆటతీరు కనబరిచాడు. అదే సమయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరిపైనా యాటిడ్యూడ్ చూపిస్తూ విమర్శల పాలయ్యాడు. ఐపీఎల్ ఫైనల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
సీజన్ మొత్తం కలిపి కూడా కనీసం 200 పరుగులు చేయలేదీ యువ ప్లేయర్. ఈ క్రమంలో ఐపీఎల్ ఫైనల్ ఓటమి తర్వాత జట్టు గురించి మాట్లాడిన రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార్ సంగక్కర అతని గురించి మాట్లాడాడు. పరాగ్ చాలా ట్యాలెంట్ ఉన్న ఆటగాడని, అతన్ని మిడిలార్డర్ బ్యాటర్గా తయారు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు.
స్పిన్, పేస్ రెంటినీ సమర్ధంగా ఎదుర్కొనే సత్తా ఉన్న పరాగ్ను.. వచ్చే ఏడాది నుంచి మంచి మిడిలార్డర్ బ్యాటర్గా తయారు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నాడు.