ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రీలంకలో క్రికెట్ గురించి చర్చించేందుకు ఆ దేశ మాజీ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య నడుం బిగించాడు. ఈ క్రమంలో బీసీసీఐతోపాటు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ సెక్రటరీ జేషాను కలిశారు. ఈ విషయాన్ని జయసూర్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. జేషాను కలవడం చాలా సంతోషంగా ఉందని, శ్రీలంకలో క్రికెట్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చించామని చెప్పాడు.
కాగా, మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ను ముందుగా శ్రీలంకలోనే నిర్వహించాలని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ మెగా టోర్నీని తాము నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. దాంతో వేదికను యూఏఈకి మార్చినట్లు ఏఐసీసీ ప్రకటించింది.
It was an honor and a pleasure to meet Mr @JayShah Honorary secretary, Indian Cricket Board & Chairman, Asian Cricket Council. Thank you sir for agreeing to see us at such short notice. We discussed some important issues regarding cricket in Sri Lanka pic.twitter.com/Z39bzUaQin
— Sanath Jayasuriya (@Sanath07) August 21, 2022