సింగపూర్ ఓపెన్
సింగపూర్: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్.. సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. గాయాలతో ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సైనా నెహ్వాల్ అద్వితీయ ఆటతీరుతో ఐదో సీడ్ హే బింగ్ జియావో (చైనా)ను మట్టికరిపించడం విశేషం.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో గురువారం సైనా 21-19, 11-21, 21-17తో బింగ్ జియావోపై గెలుపొందగా.. పీవీ సింధు 19-21, 21-19, 21-18తో లిన్ (వియత్నాం)ను మట్టికరిపించింది. మూడు గేమ్ల పాటు జరిగిన మ్యాచ్ల్లో మన అమ్మాయిలు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 14-21, 22-20, 21-18తో మూడో సీడ్ టైన్ చెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్లో అర్జున్-ధ్రువ్ జంట ముందడుగు వేయగా.. తొలి రౌండ్లో సంచలన విజయంతో ప్రిక్వార్టర్స్ చేరిన అశ్మిత చలిహా ఓడింది.