India Vs SA ODI | లక్నోలో గురువారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై టీం ఇండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్లో సంజూ శాంసన్ మెరుపులు మెరిపించినా.. అంతకుముందు శ్రేయస్ అయ్యర్.. బ్యాట్ ఝుళిపించినా ప్రయోజనం లేకపోయింది. శ్రేయస్ అయ్యర్.. తర్వాత సంజూ శాంసన్, శార్థూల్ ఠాకూర్ నిలకడగా ఆడినా మిగిలిన ప్లేయర్లు క్రీజ్లో అంతగా నిలబడకపోవడంతో దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా ఓటమి పాలైంది. మ్యాచ్ ముగిసే సమయానికి సంజూ శాంసన్ మెరుపులు మెరిపించాడు. ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 20 పరుగులతో శాంసంగ్ 86 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో టీం ఇండియాపై దక్షిణాఫ్రికా 1-0 పాయింట్ల తేడాతో ఆధిక్యం సాధించింది.
అంతకుముందు బ్యాటింగ్లో సంజూ శాంసన్ ఒంటరి పోరాటానికి దన్నుగా ఉన్న శార్దూల్ ఠాగూర్.. నిగిడి బౌలింగ్లో ఔటయ్యాడు. అప్పటికి ఠాగూర్ స్కోర్ 33 పరుగులు.. జట్టు స్కోర్ 211. నిగిడి బౌలింగ్లో శార్దూల్ ఠాగూర్ కొట్టిన బంతిని మహారాజ్ క్యాచ్ పట్టడంతో ఠాకూర్ ఆట ముగిసింది. ఆ తర్వాత బంతికే కుల్దీప్ను పెవిలియన్కు పంపించాడు నిగిడి. దక్షిణాఫ్రికా బౌలర్ రబడా వేసిన 39వ ఓవర్లో అవేశ్ఖాన్ రూపంలో మరో వికెట్ పోగొట్టుకుంది. అప్పటికి జట్టు స్కోర్ 220 పరుగులు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీం ఇండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే పెవిలియన్ దారి పట్టాడు. దక్షిణాఫ్రికా బౌలర్ నిగిడి బౌలింగ్లో 27 ఓవర్ బంతిని నేరుగా రబడాకు క్యాచ్ ఇవ్వడంతో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు 36 బంతుల్లో 8 ఫోర్లతో అయ్యర్ తన అర్థ సెంచరీ కంప్లీట్ చేశాడు.
26వ ఓవర్లో మహరాజ్ వేసిన చివరి బంతిని ఆడటంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇదే ఓవర్లో నాలుగో బంతిని ఫోర్గా మార్చిన శ్రేయస్.. డిఫెన్స్కు ప్రాధాన్యం ఇచ్చాడు. టీం ఇండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ 26వ ఓవర్ చివరి బంతిని సింగిల్గా మల్చడంతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అంతకుముందు 24 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. టీం ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 250 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో ఒత్తిడికి గురైన టీం ఇండియా ప్లేయర్లు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. 8 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు ఔటై క్రీజ్ను వీడారు.