India Vs SA ODI | లక్నోలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లో ఠాకూర్ వేసిన తొలి బంతిని ఆడిన జన్నెమాన్ మలాన్ ఔటయ్యాడు. ఆ బంతిని శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో సఫారీలు తొలి వికెట్ను కోల్పోయారు. అప్పటికి జట్టు స్కోర్ 49 పరుగులు. అంతకుముందు టాస్ గెలుచుకున్న టీం ఇండియా బౌలింగ్ ఎంచుకున్నది.
ఇప్పటికే టీ-20 సిరీస్ను సొంతం చేసుకున్న టీం ఇండియా.. మరో సిరీస్పై కన్నేసింది. గురువారం తొలుత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన వన్డే మ్యాచ్.. వరుణుడు అడ్డంకిగా మారడంతో వాయిదా పడుతూ వచ్చింది.
వర్షం నేపథ్యంలో వన్డే మ్యాచ్ను 40 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. కాగా, టీం ఇండియాకు శిఖార్ ధావన్ సారధ్యం వహిస్తున్నాడు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ-20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లడంతో దక్షిణాఫ్రికాతో సిరీస్కు శిఖార్ ధావన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.