Sachin Tendulkar | భారత లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, అంజలి దంపతులు గురువారం తాజ్మహల్ను సందర్శించారు. ఉత్తర్ప్రదేశ్ ఆగ్రా నగరంలో ఉన్న ప్రేమసౌధాన్ని ప్రేమికుల దినం మరుసటి రోజున వీక్షించారు. ఆగ్రాకు వచ్చిన సచిన్ దంపతులకు ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ లభించింది. తాజ్ మహల్ను చూసేందుకు వచ్చిన పర్యాటకులంతా సచిన్ను చూడగానే సెల్ఫీలు తీసుకునేందుకు ఒక్కసారిగా పోటీపడ్డారు.
అయితే, సచిన్ చుట్టూ భారీ భద్రత సిబ్బంది వలయాన్ని వెళ్లలేకపోయారు. ప్రేమికుల రోజు తర్వాత సచిన్ టెండుల్కర్ తన భార్య అంజలి టెండూల్కర్తో కలిసి తాజ్ మహల్ చేరుకోగా.. క్రికెట్ దేవుడిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. భారీ భద్రత మధ్య తాజ్మహల్ను వీక్షించారు. సచిన్, అంజలి దంపతులు కలిసి డయానా బెంచ్పై కూర్చుని ఫొటోలు తీసుకున్నారు.
#WATCH | Cricket legend Sachin Tendulkar and his family visited the Taj Mahal in Agra, Uttar Pradesh today. pic.twitter.com/D3DaTTtnAZ
— ANI (@ANI) February 15, 2024