Sachin Tendulkar : ఆటకు వీడ్కోలు పలికిన లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్(IPL) 16వ సీజన్లో సందడి చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians) హెడ్ కోచ్గా సేవలందిస్తున్న అతను ట్విట్టర్ వేదిక గా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా.. ఈ లిటిల్ మాస్టర్ తన కెరీర్లో ముఖ్యమైన సంఘటన గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ‘2011 వన్డే వరల్డ్ కప్ ఫైన్లలో ఔటయ్యాక విరాట్ కోహ్లీతో ఏం చెప్పారు?’ అని ఒక ఫ్యాన్ సచిన్ను అడిగాడు. అందుకు ‘బంతి ఇంకా స్వింగ్ అవుతంది’ అని చెప్పాను అని సచిన్ తెలిపాడు.
సొంత గడ్డపై శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సచిన్ 18 పరుగులకే ఔటయ్యాడు. లసిత్ మలింగ బౌలింగ్లో కీపర్ కుమార సంగక్కరకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్ వెళ్తున్న అతను మైదానంలోకి వస్తున్న కోహ్లీతో బంతి స్వింగ్ అవుతుందని చెప్పాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 35 రన్స్ కొట్టాడు.
“Ab bhi ball thoda swing ho raha hai!” https://t.co/7V5WFbkmQx
— Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274 రన్స్ కొట్టింది. మహేల జయవర్ధనే(103) సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత గౌతం గంభీర్(97), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (91 నాటౌట్) ధనాధన్ ఆడారు. ధోనీ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు. దాంతో భారత్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. రెండోసారి వరల్డ్ కప్ను ముద్దాడింది. 1983లో కపిల్ దేవ్ (Kapil Dev) సారథ్యంలో టీమిండియా మొదటిసారి వన్డే వరల్డ్ కప్ అందుకుంది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ను చిత్తు చేసి విజేతగా నిలచింది.