హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ ఆతిథ్యమివ్వనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’కు కేంద్ర ప్రభుత్వం రూ. 22 కోట్లు విడుదల చేసింది. 8వ ఎడిషన్గా జరుగబోయే ఈ క్రీడలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్లోనూ నిర్వహించనున్నారు. 25 క్రీడాంశాల్లో సుమారు ఆరు వేల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని అంచనా.