హైదరాబాద్, సెప్టెంబర్9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేట్ దవాఖానల దోపిడీని నియంత్రించాలని ఎమ్మెల్సీ విజయశాంతి డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో ఆమె మా ట్లాడుతూ.. ప్రిస్క్రిప్షన్ నుంచి ఆపరేషన్ వరకు రోగులను పీల్చి పిప్పిచేస్తున్నారని మండిపడ్డారు. అనుమతులకు విరుద్ధంగా దవాఖానలను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి టాస్క్ఫోర్స్ ద్వారా మోసాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసు అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని కోరారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏల విడుదల వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
బుధవారం అసెంబ్లీలో సహచర ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్తో కలిసి సీఎం రేవంత్రెడ్డిని క లిసి పలు అంశాలపై వినతిపత్రాన్ని సమర్పించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జేఏసీ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు శ్రీపాల్రెడ్డి తెలిపారు. పోలీసు రిక్రూట్మెంట్ అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని కోరారు. జనరల్ అభ్యర్థులకు 32, ఎస్సీ, ఎస్టీలకు 37 ఏండ్లకు పెంచాలని కోరగా అధికారులకు ఆదేశాలిచ్చారు.