హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఎమ్మెల్సీల పెండింగ్ నియోజకవర్గ అభివృద్ధి(సీడీపీ) నిధులను వెంటనే విడుదల చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో బుధవారం జరిగిన స్పెషల్ మెన్షన్స్ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఎమ్మెల్సీల పెండింగ్ సీడీపీ నిధులపై ప్రస్తావించారు.
వరంగల్ జిల్లా ఎమ్మెల్సీలకు దాదాపు రూ.113 కోట్ల ప్రతిపాదనలు చేయగా, సీఎం సూచనల మేరకు రూ.49 కోట్లు విడుదల చేస్తామని చెప్పారని అన్నారు. నేటికీ నిధులు విడుదల చేయలేదని చెప్పారు. సీఎం మాటకు కూడా విలువలేకుంటే.. ఆ నిధులను రద్దు చేయాలని డిప్యూటీ చైర్మన్ పేర్కొన్నారు. ఈ దశలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జోక్యం చేసుకొని నిధుల విషయం డిప్యూటీ సీఎం పరిధిలోనిది అయినప్పటికీ.. జిల్లా ఇన్చార్జి మంత్రిగా మీరు సంతకం చెస్తేనే భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేస్తారని, అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకొని సమస్య పరిష్కరించాలంటూ మంత్రి పొంగులేటికి చురకలు అంటిస్తూ ఆదేశాలు జారీచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి హరీశ్రావుపై చేతబడి, ఆరోపణలకు సంబంధించి దాఖలైన ఫిర్యాదును జాతీయ మానవ హకుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్రెడ్డి, ప్రభుత్వ విప్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్రావుపై చేతబడి ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సభ్యసమాజానికి తప్పుడు సందేశం వెళ్తున్నదని హరీశ్రావు తరఫు న్యాయవాది కారుపోతుల రేవంత్ జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ఆగస్టు 4న ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పారు. ఆగస్టు 17న డీజీపీకి సవివరమైన విన్నపాన్ని ఇచ్చినా దర్యాప్తు ప్రారంభించలేదని ఆరోపించారు. ఫిర్యాదులో పేరొన్న అంశాలపై తగిన చర్యలు తీసుకుని, లేఖ అందిన తేదీ నుంచి నాలుగు వారాల్లో యాక్షన్ టేకెన్ రిపోర్టు(ఏటీఆర్)ను కమిషన్కు సమర్పించాలని డీజీపీ సీవీ ఆనంద్ను ఆదేశించింది.