రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ (70 నాటౌట్) మరోసారి సత్తా చాటాడు. బ్యాటింగ్ చేయడం కష్టంగా కనిపిస్తున్న వాంఖడే పిచ్పై టైం తీసుకొని ఇన్నింగ్స్ నిర్మించాడు. రెండో ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (4) అవుటవడంతో దేవదత్ పడిక్కల్ (37)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. వీళ్లిద్దరూ కలిసి రెండో వికెట్కు 70 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్ను హర్షల్ పటేల్ అవుట్ చేశాడు.
కాసేపటికే కెప్టెన్ సంజూ శాంసన్ (8) కూడా పెవిలియన్ చేరాడు. అతన్ని హసరంగ వెనక్కు పంపాడు. ఈ క్రమంలో హెట్మెయర్ (42 నాటౌట్)తో జత కలిసిన బట్లర్.. నాలుగో వికెట్కు మరో 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడం కష్టంగా కనిపించినప్పటికీ.. చివరి రెండు ఓవర్లలో వీళ్లిద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.
సిరాజ్ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు, ఆకాష్ దీప్ వేసిన చివరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, హసరంగ తలో వికెట్ తీసుకున్నారు.
We have a chase on our hands.
Batters, you’re up! 🙌🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RRvRCB pic.twitter.com/zNE1xa626c
— Royal Challengers Bangalore (@RCBTweets) April 5, 2022