ఈ ఐపీఎల్లో ప్రతి టీం నడుస్తున్న దారిలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా నడిచాడు. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన అతను.. రెండో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు ప్రభావం కారణంగా ఈ ఐపీఎల్లో టాస్ గెలిచిన ప్రతి జట్టూ బౌలింగ్ ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా సూపర్ స్టార్ మ్యాక్స్వెల్ బెంగళూరు శిబిరంలో చేరినప్పటికీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిబంధనల కారణంగా ఈ మ్యాచ్లో అతను ఆడటం లేదని సమాచారం. కెప్టెన్ డుప్లెసిస్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. తమ జట్టులో ఎటువంటి మార్పులూ లేవని, కోల్కతాతో ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని చెప్పాడు. రాజస్థాన్ జట్టులో కూడా మార్పులేవీ లేవని సంజు శాంసన్ తెలిపాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, షెర్ఫానే రూథర్ఫర్డ్, దినేష్ కార్తీక్, డేవిడ్ విల్లీ, షాబాజ్ అహ్మద్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైని, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ.
Faf has won the toss and we will be bowling first. 💪🏻
No changes in the Playing XI for tonight as well. ✅
It’s GO time! 🤜🏻🤛🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RRvRCB pic.twitter.com/qPMqoFVlUD
— Royal Challengers Bangalore (@RCBTweets) April 5, 2022