ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (15) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (16) కూడా పెవిలియన్ చేరాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న కుమార్ కార్తికేయ బౌలింగ్లో శాంసన్ పెవిలియన్ చేరాడు. కార్తికేయ వేసిన బంతిని అప్పర్ కట్ చేసిన అతను.. డీప్ పాయింట్లో టిమ్ డేవిడ్కు చిక్కాడు. దీంతో 54 పరుగుల వద్ద రాజస్థాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. శాంసన్ అవుటవడంతో డారియల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు.