న్యూఢిల్లీ : సమీప భవిష్యత్తులో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 మ్యాచ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వన్డే ప్రపంచకప్కు ముందే తెలిపాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది నవంబరులో టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ మళ్లీ టీ20లు ఆడలేదు. అప్పటినుంచి హార్దిక్ పాండా టీ20 జట్టుకు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. టీ20లకు దూరంగా ఉండాలన్నది రోహిత్ స్వయం నిర్ణయమని, ఆ విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్కు ముందే తెలిపాడని బోర్డు సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు. భవిష్యత్తులో పని భారాన్ని తగ్గించుకునేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు అతను ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అన్నారు.