టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం క్రికెట్ అభిమానులనే కాదు, మొత్తం క్రీడాలోకాన్నే షాక్కు గురిచేసింది. ఈ నిర్ణయంపై చాలామంది వివిధ రకాలుగా స్పందించారు. ప్రస్తుతం టీం సభ్యులు కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. సౌతాఫ్రికాలో ఉన్న జట్టు సభ్యులందరికీ తన నిర్ణయాన్ని ఒక రోజు ముందుగానే కోహ్లీ వెల్లడించినట్లు సమాచారం.
ఈ క్రమంలో గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న భారత జట్టు వైట్బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా కోహ్లీ నిర్ణయంపై స్పందించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన రోహిత్.. కోహ్లీ నిర్ణయం తనకు షాకిచ్చిందన్నాడు.
‘‘షాకయ్యా! భారత కెప్టెన్గా విజయవంతమైన కాలాన్ని గడిపినందుకు అభినందనలు’’ అని పోస్టు పెట్టాడు. రోహిత్ ఒక్కడే కాదు. షమీ, బుమ్రా, రాహుల్, ఇషాంత్ కూడా కోహ్లీ నిర్ణయంపై స్పందించారు. ముఖ్యంగా బుమ్రా ట్వీట్ చేస్తూ.. ‘‘ఒక కెప్టెన్గా జట్టుకు నువ్వందించిన సహకారం విలువలేనిది’’ అని చెప్పాడు. ప్రస్తుతం క్రీడాలోకం మొత్తం విరాట్ నిర్ణయం గురించే మాట్లాడుకుంటుందనడం అతిశయోక్తేమీ కాదు.