టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ నుంచి జట్టు పగ్గాలు అందుకోవడం గురించి ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ పెదవి విప్పాడు. కోహ్లీ నుంచి జట్టు పగ్గాలు అందుకోవడంలో ఎలాంటి సమస్యా లేదని హిట్మ్యాన్ చెప్పాడు. కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు తాను వైస్ కెప్టెన్గా ఉన్న విషయాన్ని రోహిత్ గుర్తుచేశాడు. జట్టును ఏ విధానంలో ముందుకు తీసుకెళ్లాలో ఇద్దరమూ ఆలోచించేవాళ్లమని, ఇప్పుడు కోహ్లీ వదిలేసిన చోటు నుంచి తాను ముందుకు తీసుకెళ్తానని వివరించాడు.
వ్యక్తిగతంగా జట్టు నుంచి ఏం ఆశిస్తున్నామో సభ్యులందరికీ తెలుసని రోహిత్ స్పష్టం చేశాడు. ఇంతకు ముందు ఏ విధానంలో ముందుకు వెళ్లామో అదే పద్ధతిలో జట్టు ముందుకెళ్తుందన్నాడు. ‘జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం అంతగా లేదు. మేం మంచి జట్టు. మంచి ఆటగాళ్లం. కాకపోతే ఒక్కోసారి పరిస్థితికి తగినట్లు మా ఆటను కొంత మార్చుకోవాలంతే’ అని వెల్లడించాడు.
#TeamIndia begin preps in Ahmedabad ahead of the ODI series against West Indies.#INDvWI pic.twitter.com/aYTd1QuexB
— BCCI (@BCCI) February 4, 2022