Rohit Sharma : ఐపీఎల్ కెప్టెన్గా విజయవంతమైన రోహిత్ శర్మ(Rohit Sharma) భారత జట్టుకు ఒక్క ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) కూడా అందించలేకపోయాడు. అతడికి ఈసారిప్రపంచ కప్(ODI World Cup 2023) రూపంలో సువర్ణావకాశం దొరికింది. సొంత గడ్డపై జరుగనున్న ఈ మెగా టోర్నీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్(Asia Cup 2023) సన్నాహకాల్లో ఉన్న రోహిత్ 2011 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై పెదవి విప్పాడు. అప్పుడు తాను తీవ్ర నిరాశకు గురయ్యానని, ఆ సమయంలో ఆల్రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ధైర్యం చెప్పాడని హిట్మ్యాన్ తెలిపాడు.
‘ఆరోజు నేను రూమ్లో కూర్చొని బాధ పడుతున్నా. ఆ సమయంలో ఏం చేయాలో నాకు దిక్కు తోచలేదు. సరిగ్గా అప్పుడే యువరాజ్ సింగ్ తన గదికి పిలిచాడు. ఇద్దరం కలిసి బయట డిన్నర్ చేసేందుకు వెళ్లాం అని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. ఆరోజు యూవీ తనకు ధైర్యం చెప్పిన తీరును వివరించాడిలా. జట్టులో చోటు దక్కనప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అయితే.. మంచి విషయం ఏంటంటే నీకు ఇంకా చాలా సమయం ఉంది. మేము వరల్డ్ కప్ ఆడే ఈ టైమ్లో నువ్వు నీ ఆటపై బాగా దృష్టి పెట్టు. నైపుణ్యం పెంచుకొని జట్టులోకి రా. అప్పుడు నీవు వరల్డ్ కప్ ఆడకపోవడం అనేది ఉండదని యూవీ నాతో అన్నాడు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. 2011లో ధోనీ(MS Dhoni) నేతృత్వంలోని భారత జట్టు చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.
2019 వరల్డ్ కప్లో 5 శతకాలు బాదిన రోహిత్ శర్మ
విధ్వసంక ఓపెనర్ అయిన రోహిత్ శర్మకు ఇది మూడో వరల్డ్ కప్. అతడు 2015లో తొలిసారి ప్రపంచ కప్లో ఆడాడు. ఆ టోర్నీలో 330 రన్స్ చేశాడు. ఇక 2019 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా బరిలోకి దిగిన హిట్మ్యాన్ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. ఒకే ప్రపంచ కప్లో ఐదు శతకాలు బాదిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో రోహిత్ 648 రన్స్ కొట్టాడు. టాప్ స్కోరర్గా నిలిచిన అతడికి ‘గోల్డెన్ బ్యాట్ అవార్డు’ లభించింది. ఈసారి ప్రపంచ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ మొదలవ్వనుంది. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ కొననున్నాయి. ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న టీమిండియా అక్టోబర్ 14న పాకిస్థాన్తో తలపడనుంది.