Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈమధ్య టీ20ల్లో అస్సలు కనపడడం లేదు. దాంతో, వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న పొట్టి ప్రపంచ కప్(T20 World Cup 2024)లో వీళ్లిద్దరూ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. అంతేకాదు ఇక పొట్టి ఫార్మాట్లో వీళ్లకు చోటు లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిట్మ్యాన్ ఈ అంశంపై ఎట్టకేలకు స్పందించాడు. నిరుడు టీ20 వరల్డ్ కప్ ఉన్నందున వన్డేలు ఆడలేదని, ఇప్పుడు వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ఉన్నందున టీ20లు ఆడడం లేదని రోహిత్ అన్నాడు.
‘గత ఏడాది కూడా మేము అదే చేశాం. టీ20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి వన్డేలు ఆడలేదు. ఇప్పుడు కూడా మేము అదే చేస్తున్నాం. త్వరలోనే సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ ఉంది. దాంతో, పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉంటున్నాం. ఎందుకంటే…? అన్ని ఫార్మాట్లో ఆడి వన్డే వరల్డ్ కప్ పోటీలకు సిద్ధం కాలేం. కోహ్లీ, నేను మాత్రమే కాదు రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా టీ20లు ఆడట్లేదు’ అని రోహిత్ వెల్లడించాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
నిరుడు ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్లో భారత్ సెమీ ఫైనల్లో ఓడిపోయింది. అప్పటి నుంచి కోహ్లీ, రోహిత్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. వెస్టిండీస్తో వన్డే సిరీస్లోనూ యువ క్రికెటర్ల కోసం తమ స్థానాన్ని త్యాగం చేశారు. ఆగస్టు 30న మొదలయ్యే ఆసియా కప్(Asia Cup 2023)లో వీళ్లిద్దరూ బరిలోకి దిగనున్నారు. ఈ టోర్నీలో వరల్డ్ కప్ జట్టు కూర్పుపై మేనేజ్మెంట్కు ఓ అవగాహన రానుంది. ఈ ఏడాది సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో కోహ్లీ, రోహిత్ కీలకం కానున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న వీళ్లు రాణిస్తే టీమిండియాకు ఇక తిరుగుండదు. అక్టోబర్ 5న ప్రపంచ కప్ మొదల్వనుంది. ఆరంభ పోరులో కివీస్, ఇంగ్లండ్తో తలపడనుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ స్టేడియంలో జరుగనుంది.