వెస్టిండీస్తో మూడో టీ20లో బ్యాటింగ్ చేస్తూ వెన్నునొప్పితో ఇబ్బందిపడిన టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆరోగ్యంపై బీసీసీఐ శుభవార్త చెప్పింది. అతడు ఫిట్గానే ఉన్నాడని, సిరీస్లో మిగిలిన రెండు మ్యాచులకూ అందుబాటులో ఉంటాడని తెలిపింది. నడుం కండారాలు పట్టేయడంతో రోహిత్.. మూడో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ ఇబ్బందిపడ్డాడు. 5 బంతుల్లో 11 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు.
ఇదిలాఉండగా మూడో మ్యాచ్ ముగిశాక చివరి రెండు టీ20లు ఆడేందుకు గానూ ఫ్లోరిడా (అమెరికా) వెళ్లాల్సి ఉన్న ఇరు జట్లలో పలువురు ఆటగాళ్లు వీసా సమస్యలతో గయానాలోనే ఉండిపోయారు. కానీ బుధవారం రాత్రి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ప్రత్యేక చొరవ తీసుకుని.. తమ దేశంలో ఉన్న అమెరికా ఎంబసీ అధికారులతో మాట్లాడి క్రికెటర్లు అమెరికా వెళ్లేందుకు కృషిచేశారు. ఈ సందర్భంగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) ఇర్ఫాన్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఇక సిరీస్లో ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగియగా భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. చివరి రెండు మ్యాచ్లు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతాయి. శనివారం (ఆగస్టు 6) నాలుగో వన్డే, ఆదివారం (7) ఐదో వన్డే జరగాల్సి ఉంది.
తొలి మూడు మ్యాచ్లలో అవకాశం దక్కని హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్లు చివరి రెండు టీ20లకు తుదిజట్టులో ఉండనున్నట్టు తెలుస్తున్నది. గత రెండు టీ20లలో విఫలమైన అవేశ్ ఖాన్తో పాటు శ్రేయాస్ అయ్యర్నూ పక్కనపెట్టనున్నారని సమాచారం.