Rohit Sharma : ప్రపంచ క్రికెట్లో తిరుగులేని ఓపెనర్, హిట్టర్లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేరు తప్పక ఉంటుంది. ఎందుకంటే..? అతను వన్డేల్లో ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీ(Double Century) బాదాడు. అంతేకాదు ఫ్రాంచైజ్ క్రికెట్(Franchise Cricket)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపాడు. ఇప్పటివరకూ హిట్మ్యాన్ తన 16 ఏళ్ల కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే.. వాటన్నింటిలోనూ ఐదు మాత్రమే అద్భుత క్షణాలు అని రోహిత్ చెప్పాడు. అవేంటో తెలుసా…?
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన 2007లో పొట్టి ప్రపంచ కప్(T20World Cup) విజయం తన కెరీర్లో మర్చిపోలేని రోజని భారత జట్టు కెప్టెన్ అన్నాడు. 2021లో అరంగేట్రం టెస్టులోనే క్రికెట్ మక్కా గబ్బా స్టేడియం(Gabba Stadium)లో ఆస్ట్రేలియాపై సెంచరీ కొట్టడం, ఆ టెస్టులో విజయం సాధించడం మర్చిపోలేనని రోహిత్ చెప్పాడు.
2007 వరల్డ్ కప్ ఫైనల్లో పాక్పై గెలిచాక భారత ఆటగాళ్ల సంబురం
2008లో ఆస్ట్రేలియాతో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)తో కలిసి 100 ప్లస్ భాగస్వామ్యం నిర్మించడం, వన్డేల్లో శ్రీలంకపై 264 పరుగులు చేయడం తన కెరీర్లో గుర్తుండిపోయే క్షణాలని రోహిత్ తెలిపాడు. అయితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్కు ఐదు ట్రోఫీలు అందిచిన రోహిత్ వాటిలో ఒక్కదానికి కూడా తన బెస్ట్ మూమెంట్స్లో చోటికవ్వకపోవడం గమనార్హం.
శ్రీలంకపై డబుల్ సెంచరీ కొట్టిన రోహిత్
ప్రస్తుతం ఆడుతున్న విధ్వంసక ఓపెనర్లలో రోహిత్ ముందువరుసలో ఉంటాడు. భారత కెప్టెన్గా విజయవంతమైన అతను ఐపీఎల్లో ముంబైకి ఐదు ట్రోఫీలు అందించాడు. అతడి సారథ్యంలోని టీమిండియా ఈ ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) చేరింది. అయితే.. ఆసీస్ పేసర్ల ధాటికి ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయడంతో భారత్ అనూహ్యంగా ఓటమి పాలైంది.
ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన రోహిత్ 1-0తో టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన రోహిత్ రెండో టెస్టులోనూ రాణించాడు. ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ జట్టును నడిపిస్తున్న అతను భారీ ఇన్నింగ్స్లు బాకీ ఉన్నాడు. ఈ టోర్నీల్లో హిట్మ్యాన్ చెలరేగితే టీమిండియాకు ఎదురులేనట్టే.