Road Safety World Series | ప్రపంచ మాజీ దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (Road Safety World Series )మళ్ళీ అభిమానులను తిరిగి అలరించేందుకు వస్తుంది. 2021, 2022 సంబంధించి భారత్లో నిర్వహించిన ఈ టోర్నీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు సీజన్లలో సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ టీమ్(India Legends team) విజేతగా నిలిచింది. కాగా తాజాగా వస్తున్న 2023 టోర్నీలో దాయాది జట్టు పాకిస్తాన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. గత రెండు ఎడిషన్లు భారత్లో జరగగా.. ఈ టోర్నీలో పాకిస్తాన్ పాల్గొనలేదు. 2023లో జరిగే మూడో సీజన్ ఇంగ్లండ్ వేదికగా నిర్వహించనున్నారు. ఇక ఈ టోర్నీలో ఆడేందుకు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లు అసక్తిగా ఉన్నట్లు.. ఆ దేశ ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చినట్లు సమాచారం.
ఈ ఏడాది జరిగే మూడో సీజన్లో తొమ్మిది జట్లు పాల్గొనున్నాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు తలపడనుండగా.. ఈ టోర్నీలో కేవలం రిటైర్డ్ క్రికెట్లరు మాత్రమే పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా రహదారి భద్రత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతోనే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నిర్వహిస్తున్నారు. ఈ సిరీస్లో సచిన్ టెండూల్కర్, కెవిన్ పీటర్సన్, సనత్ జయసూర్య, షేన్ వాట్సన్, తిలకరత్నే దిల్షాన్, యువరాజ్ సింగ్లతో పాటు బ్రియాన్ లారా, జాంటీ రోడ్స్, షేన్ బాండ్, రాస్ టేలర్ వంటి వెటరన్ క్రికెటర్లు టోర్నీలో పాల్గొనున్నారు. ఇక త్వరలోనే ఈ టోర్నీషెడ్యూల్ను ప్రకటించనున్నారు.
Pakistan🇵🇰 to feature in Road Safety World Series for the first time🏏 pic.twitter.com/PkmY1ZYMqt
— CricketGully (@thecricketgully) August 5, 2023