ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. దీని కోసం లీసెస్టర్షైర్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. దాంతో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్లో రోహిత్ ఆడటం లేదని, బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారని ప్రచారం సాగుతోంది.
అయితే రోహిత్ విషయంలో ఇంకా క్లారిటీ లేదని, అతను మ్యాచ్కు దూరమైనట్లు స్పష్టంగా చెప్పలేమని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. ప్రస్తుతానికి రోహిత్ తమ మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడని చెప్పిన ద్రావిడ్.. భారత కెప్టెన్కు బుధ, గురువారాల్లో మళ్లీ కరోనా టెస్టులు చేస్తామని, వాటి ఫలితాల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.
ఇంగ్లండ్ చేరుకున్న తర్వాత మాస్కు లేకుండానే షాపింగ్కు వెళ్లిన రోహిత్.. అక్కడ కనిపించిన అభిమానులతో సెల్ఫీలు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా రిషభ్ పంత్ కూడా ఇదే పని చేశాడు. దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా ఇంకా పూర్తిగా సమసిపోలేదని, ఆటగాళ్లు ఇలాంటి పనులు చేయొద్దని మందలించినట్లు సమాచారం.