Team India Vs Australia | ఆస్ట్రేలియాతో రాజ్కోట్లో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో టీం ఇండియా సారధి రోహిత్ శర్మ 31 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. తొమ్మిదో ఓవర్ లో గ్రీన్ వేసిన మూడో బంతిని స్టార్క్ క్యాచ్ విడవడంతో రెండు పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. 13 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా ఒక వికెట్ కోల్పోయి 84 పరుగులు చేసింది.
క్రీజ్లో టీం ఇండియా సారధి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు. అంతకుముందు 11 ఓవర్ లో మ్యాక్స్ వెల్ వేసిన ఐదో బంతిని లబుచాగ్నే క్యాచ్ పట్టడంతో ఓపెనర్ వాషింగ్టన్ సుందర్ (18) పరుగులతో ఔటయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది.