అడిలైడ్: ప్రపంచకప్ చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమ్ఇండియా.. అందులో మొదటి అంకాన్ని పూర్తి చేసి సెమీఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నది. గురువారం ఇంగ్లండ్తో రెండో సెమీస్లో తలపడనున్న నేపథ్యంలో భారత జట్టు మంగళవారం అడిలైడ్ మైదానంలో ప్రాక్టీస్ కొనసాగించింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో ఆందోళన రేకెత్తినా.. గాయం తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. ప్రాక్టీస్లో రోహిత్ మోచేతికి బంతి తాకడంతో గాయపడినట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గాయం తీవ్రమైనది కాదని అన్నారు.