Rohit Sharma : టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ (Rohit Sharma)కు ప్రత్యేక గౌరవం లభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అతడి పేరిట స్టాండ్ ఏర్పాటు చేసింది ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA). శుక్రవారం ఈ పెవిలియన్ను రోహిత్ అమ్మానాన్న పూర్ణిమా శర్మ, గురునాథ్ శర్మలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హిట్మ్యాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని రోహిత్ అన్నాడు.
‘ఇలాంటి రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. మనం ఆటగాడిగా ఎన్నో మైలురాళ్లకు చేరువవుతాం. కానీ, మనం చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడిన మైదానంలో ఒక స్టాండ్ మన పేరుతో ఉండడం అనేది ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. ఎందుకంటే.. వాంఖడే నాకు ఎంతో ప్రత్యేకం. ఈ మైదానంలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. భారత క్రికెట్ దిగ్గజాలు.. రాజకీయవేత్తల సరసన నా పేరు ఉండడం నిజంగా గొప్ప గౌరవం. ఈ క్షణం నా మనను గర్వంతో ఉప్పొంగుతోంది.
#WATCH | Mumbai | Rohit Sharma stands unveiled at Wankhede stadium. Indian ODI men’s cricket team captain Rohit Sharma and his family, Maharashtra CM Devendra Fadnavis, NCP-SCP chief Sharad Pawar, and others, are also present.
The Mumbai Cricket Association (MCA) is formally… pic.twitter.com/K39kSfRkCY
— ANI (@ANI) May 16, 2025
21వ తేదీన నేను ఇక్కడ ఆడుతున్నప్పుడు నా పేరుతో ఉన్న పెవిలియన్ను చూడడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది’ అని రోహిత్ వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో ముంబై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు, రోహిత్ భార్య.. ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీమిండియా మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్లను ఎంసీఏ సన్మానించింది. రోహిత్ శర్మ స్టాండ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.