Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ మరో ఘనత సొంతం చేసుకున్నాడు. భారత జట్టు తరఫున టీ20లలో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా మహేంద్ర సింగ్ ధోని తర్వాతి స్థానంలో హిట్మ్యాన్ నిలిచాడు. ధోని తన కెరీర్లో 72 మ్యాచ్లలో కెప్టెన్గా ఉండి 41 విజయాలు సాధించాడు. తాజాగా అఫ్గానిస్తాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో గెలవడంతో రోహిత్.. ధోని రికార్డును సమం చేశాడు. టీమిండియాకు 53 మ్యాచ్లలో సారథిగా ఉన్న రోహిత్.. 41 విజయాలు అందుకున్నాడు. మరో మ్యాచ్ గెలిస్తే రోహిత్.. భారత్ తరఫున అత్యధిక విజయాలు సొంతం చేసుకున్న తొలి కెప్టెన్గా నిలుస్తాడు.
2021లో దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 పగ్గాలు వదిలేయడంతో భారత సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్.. టీమిండియాను విజయాల బాటలో నడిపిస్తున్నాడు. స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా టీమిండియాకు విజయాలను అందిస్తున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్లో భారత్ను సెమీస్కు చేర్చిన రోహిత్.. వచ్చే జూన్లో జరగాల్సి ఉన్న పొట్టి ప్రపంచకప్లోనూ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.
Most wins as Indian Men’s captain in T20I:
Rohit Sharma – 41* (53 games)
MS Dhoni – 41 (72 games) pic.twitter.com/sLCbbLMnNS
— Johns. (@CricCrazyJohns) January 15, 2024