డిసెంబర్లో జరుగబోయే సౌతాఫ్రికా సిరీస్లో టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కలిసి ఆడడం లేదు. ఇది కెప్టెన్సీకి సంబంధించిన వివాదమో లేక యాదృచ్ఛికమో.. తెలియలేదు. సిరీస్కు ఇద్దరు కెప్టెన్లు వెళతారు కానీ టెస్టు మ్యాచ్లు, వన్డేలలో మాత్రం కలిసి ఒక్క మ్యాచ్ కూడా ఆడరు.
అలా ఆడకపోవడానికి ఎవరి కారణలు వారు చెబుతున్నారు. సౌతాఫ్రికా సిరీస్లో భాగంగా భారత్ ముందుగా మూడు టెస్టు మ్యాచ్లు ఆడాలి. ఆ తరువాత మూడు వన్డే మ్యాచ్లు ఆడాలి. కానీ రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్టు మ్యాచ్లకు దూరమయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లి వన్డే బృందం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. జనవరిలో తన పాప మొదటి పుట్టినరోజు ఉండడంతో ఆ సమయంలో వన్డేలకు ఆడలేనని విరాట్ ఇప్పటికే బిసిసిఐ అధికారులకు తెలిపాడు.
అయితే డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్లకు కోహ్లి సారథ్యం వహిస్తుండగా.. జనవరి 19 నుంచి జరిగే వన్డేలకు రోహిత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వీరిద్దరూ కారణాలు ఏమి తెలిపినా.. ఒకరి సారథ్యంలో మరొకరు ప్రస్తుతానికి ఆడడం లేదు.