ODI Team Of The Year : వన్డేల్లో వీరకొట్టుడుతో అభిమానులను అలరిస్తున్న భారత క్రికెటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) ‘ఈఎస్పీఎన్ వన్డే జట్టు 2025′(ESPN ODI Team Of The Year 2025)కు ఎంపికయ్యారు. నిరుడు టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన హిట్మ్యాన్కు కెప్టెన్సీ దక్కగా.. దక్షిణాఫ్రికాపై శతకాలతో రెచ్చిపోయిన కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానం కాపాడుకున్నాడు. 2025లో వన్డేల్లో అద్భుతంగా రాణించిన 11 మందితో గురువారం ఈఎస్పీఎన్ జట్టును ప్రకటించింది. అందులో భారత్ నుంచి రో-కోకు మాత్రమే చోటు దక్కింది.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా చెలరేగిపోతున్న భారత సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈఎస్పీఎయన్ జట్టులో చోటు సంపాదించారు. కెప్టెన్, ఓపెనర్గా రోహిత్ ఎంపికవ్వగా.. అతడికి జోడీగా దక్షిణాఫ్రికా కుర్రాడు మాథ్యూ బ్రీట్ట్ను తీసుకున్నారు. మూడో స్థానంలో కోహ్లీ, నాలుగో స్థానానికి జో రూట్ సెలెక్ట్ అయ్యారు.
నిరుడు సెంచరీలతో రెచ్చిపోయిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ ఆల్రౌండర్గా చోటు దక్కించుకున్నాడు. మిచెల్ శాంట్నర్, హ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్) బౌలింగ్ యూనిట్లో నిలిచారు. ఇంగ్లండ్ స్టార్లు ఆదిల్ రషీద్ స్పిన్నర్గా, జోఫ్రా ఆర్చర్, జైడెన్ సీల్స్(వెస్టిండీస్) పేస్ బౌలర్లుగా వన్డే జట్టు ఆఫ్ ది ఇయర్ 2025కు ఎంపికయ్యారు.
వన్డే జట్టు ఆఫ్ ది ఇయర్ 2025 : రోహిత్ శర్మ(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్, విరాట్ కోహ్లీ, జో రూట్, షాయ్ హోప్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మ్యాట్ హెన్రీ, జైడెన్ సీల్స్.