ఢాకా: గాయం కారణంగా బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు దూరమైన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండో మ్యాచ్లో బరిలోకి దిగేది కూడా అనుమానంగా మారింది. వన్డే సిరీస్ సందర్భంగా హిట్మ్యాన్ బొటనవేలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో చికిత్స కోసం స్వదేశానికి తిరిగివచ్చిన రోహిత్ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆదివారం మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో రోహిత్ గాయంపై స్పష్టత వస్తుందని పేర్కొనగా.. హిట్మ్యాన్ గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదని బీసీసీఐ అధికారి తెలిపారు.