IND vs ENG 5th Test : ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(101 నాటౌట్ : 155 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు), యువకెరటం శుభ్మన్ గిల్(100 నాటౌట్: 140 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. తొలి సెషన్లో సిక్సర్లతో విరుచుకుపడిన హిట్మ్యాన్ సిరీస్లో రెండో, మొత్తంగా 12వ సెంచరీ నమోదు చేశాడు.
ఆ కాసేపటికే బషీర్ బౌలింగ్లో బౌండరీ బాది.. రాంచీ హీరో గిల్ మూడంకెల స్కోర్ సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వని ఈ జోడీ కు 160పరుగులు చేసింది. గిల్, రోహిత్ వీరవిహారంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులు ఆధిక్యంలో ఉంది. లంచ్ సమయానికి భారత్ స్కోర్.. 264/1.
💯 for Rohit Sharma! 🙌
His 12th Test ton! 👏
Talk about leading from the front 👍 👍
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/LNofJNw048
— BCCI (@BCCI) March 8, 2024
TON-up Shubman Gill! 👏 👏
4⃣th hundred in Tests for him 👌 👌
What a fine knock this has been! 🙌 🙌
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/DiKb1igdv5
— BCCI (@BCCI) March 8, 2024
ఓవర్నైట్ స్కోర్ 135-1తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. కుర్ర ఓపెనర్ యశస్వీ జైస్వాల్(57) హాఫ్ సెంచరీ బాదడంతో టీమిండియా ఇన్నింగ్స్ పరుగులు పెట్టింది. అయితే.. ఫిఫ్టీ తర్వాత బషీర్ ఓవర్లో యశస్వీ ఔటైనా.. రోహిత్, గిల్లు మరో వికెట్ పడకుండా ఆడారు. రెండో రోజు తొలి సెషన్లో రెచ్చిపోయిన ఈ జోడీ బషీర్ను లక్ష్యంగా చేసుకొని బౌండరీలు కొట్టింది.
యశస్వీ జైస్వాల్(57)
తొలి రోజు కుల్దీప్ యాదవ్ విజృంభణతో ఇంగ్లండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఓపెనర్ జాక్ క్రాలే(79) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ 4 వికెట్లు తీసి బెన్ స్టోక్స్ సేనను 218 పరుగులకే కట్టడి చేశాడు.