హైదరాబాద్, ఆటప్రతినిధి: అజంతా బజాజ్ స్మారక ఆల్ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో రోహన్ గుర్బాని విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో రోహన్ 21-13, 23-21తో సిద్ధాంత్ గుప్తాపై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా 16-21, 21-18, 21-19తో అదితి భట్పై గెలుపొందింది. పురుషుల డబుల్స్లో అరుణ్ జార్జ్-సాన్యమ్ శుక్లా జోడీ 21-17, 21-19తో సుమీత్ రెడ్డి-నందగోపాల్ ద్వయంపై విజయం సాధించగా..
మహిళల డబుల్స్లో ప్రియా దేవి-శృతి మిశ్ర జంట 21-14, 21-7తో ధన్య-రిద్ధి కౌర్ ద్వయంపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్లో కావ్య గుప్తా-జయంత్ జోషి జంట 19-21, 21-5, 21-17తో హేమంగ్-కనిక జోడీపై గెలిచింది. ఆదివారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.