న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టుకు రైజింగ్ స్టార్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్లో తొలి మూడు మ్యాచ్లకు అతనే సారధిగా కొనసాగుతాడు. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్.. ఆ మ్యాచుల్లో స్పెషలిస్టు బ్యాటర్ కమ్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా ఆడనున్నాడు. ఇటీవల శాంసన్ చేతి వేలికి శస్త్ర చికిత్స జరిగింది. అయితే అతను పూర్తి స్థాయి కీపర్గా బరిలోకి దిగేందుకు ఇంకా క్లియరెన్స్ దక్కలేదు. దీంతో శాంసన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవాలని రాజస్థాన్ రాయల్స్ ప్లాన్ వేసింది.
ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ సమయంలో.. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో శాంసన్ వేలికి గాయమైన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేసేందుకు శాంసన్కు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ వికెట్ కీపింగ్ చేసేందుకు బీసీసీఐ ఎక్సలెన్స్ సెంటర్ నుంచి ఇంకా అనుమతి రాలేదు. శాంసన్ వేళ్లకు మరింత రెస్టు కావాలని ఎక్సలెన్స్ సెంటర్ అభిప్రాయపడింది. దీంతో 23 ఏళ్ల రియాన్ పరాగ్కు .. రాజస్థాన్ రాయల్స్ సారథ్య బాధ్యతలను అప్పగించారు. కోహ్లీ తర్వాత ఐపీఎల్లో అతి పిన్న వయసులో కెప్టెన్సీ చేపట్టనున్నట్లు ప్లేయర్గా రియాన్ పరాగ్ నిలవనున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్లో మార్చి 23వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనున్నది. ఆ తర్వాత మార్చి 26వ తేదీన కోల్కతాతో, 30వ తేదీన చెన్నైతో ఆడనున్నది. వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ కోసం క్లియరెన్స్ దక్కే వరకు.. శాంసన్ స్పెషలిస్టు బ్యాటర్గా ఆడుతాడని ఆర్ఆర్ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తిగా ఫిట్ అయిన తర్వాత మళ్లీ సారథిగా శాంసన్ బరిలోకి దిగుతాడు.
💪 Update: Sanju will be playing our first three games as a batter, with Riyan stepping up to lead the boys in these matches! 💗 pic.twitter.com/FyHTmBp1F5
— Rajasthan Royals (@rajasthanroyals) March 20, 2025