Rishabh Pant : భారత జట్టు వికెట్కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) సోదరి సాక్షి పంత్(Sakshi Pant) ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంకిత్ చౌదరీ(Ankit Choudary)తో, సాక్షి పెండ్లి చూపుల (Engagement)వేడుక సందడిగా జరిగింది. ఈ సందర్భంగా సోదరి, కాబోయే బావ, తల్లితో కలిసి దిగిన ఫొటోలను పంత్ కంగ్రాట్యులేషన్స్ సిస్’ అనే క్యాప్షన్తో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
ఆ ఫొటోలు చూసిన క్రికెటర్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. సాక్షి, అంకిత్లు తొమ్మిదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ల వివాహానికి ఇరుకుటుంబాలు పచ్చ జెండా ఊపడంతో శనివారం ఎంగేజ్మెంట్ను నిర్వహించారు. త్వరలోనే ఈ జంట పెండ్లితో ఒక్కటి కానుంది.
భారత క్రికెట్లో దూకుడుకు మారుపేరుగా నిలిచిన పంత్ 2022 డిసెంబర్లో కారు యాక్సిడెంట్తో ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో కోలుకున్న పంత్ త్వరలోనే మైదానంలో మెరుపులు మెరిపించనున్నాడు.
ప్రస్తుతం ఫిట్నెస్పై దృష్టి పెట్టిన ఈ డాషింగ్ హిట్టర్ ఐపీఎల్ 17వ సీజన్లో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కెప్టెన్గా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే.. ఈ ఏడాది జూన్లో జరిగే టీ20 వరల్డ్ కప్లో పంత్ ఆడతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.