Rishabh Pant | టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. పంత్ తాజాగా తన ఆరోగ్యంపై అభిమానులకు అప్డేట్ ఇచ్చాడు. ‘ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే చాలా హాయిగా అనిపిస్తోంది’ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ ఫొటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
అయితే, ఆ ఫొటో ఆసుపత్రి వద్దదే అని తెలుస్తోంది. ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి మోకాళ్లకు వైద్యులు పలు శస్త్రచికిత్సలు చేశారు. అతడు పూర్తిగా కోలుకొని తిరిగి మైదానంలోకి రావడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఇప్పటికే బీసీసీఐ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. కోలుకొని, ఫిట్ నెస్ సాధిస్తే ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచ కప్లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది డిసెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.