టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో యువ కీపర్ రిషభ్ పంత్కు చోటు దక్కడం కష్టంగా కనపడుతోందని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన 5 టీ20ల సిరీస్లో పంత్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో పంత్ 14.50 సగటు, 105.56 స్ట్రైక్ రేట్తో కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో వెటరన్ కీపర్ దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణించాడు.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో కార్తీక్కు చోటివ్వాలని పలువురు మాజీలు చెప్తున్న సంగతి తెలిసిందే. ‘‘ప్రస్తుతం చూసుకుంటే పూర్తి సామర్థ్యం ఉండే భారత జట్టులో రిషభ్ పంత్కు చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. కావాలంటే రోహిత్, ఇషాన్ ఓపెనింగ్ చేయొచ్చు.
తర్వాత కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్, దినేష్ కార్తీక్, జడేజా వస్తారు. ఈ లైనప్లో పంత్ను ఇరికించడం కష్టమే’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. అయితే సిరీస్ ముగిసిన తర్వాత కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. పంత్కు పూర్తి మద్దతు తెలిపాడు. భారత జట్టులో పంత్ చాలా ముఖ్యమైన భాగమని అభిప్రాయపడ్డాడు.