చాటోగ్రామ్: విరాట్ కోహ్లీ వదిలేసిన క్యాచ్ను.. కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా పట్టుకున్నాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ శాంత్ ఇచ్చిన క్యాచ్ను ఫస్ట్ స్లిప్లో ఉన్న కోహ్లీ అందుకోలేకపోయాడు. కోహ్లీ చేతుల్లో పడ్డ ఆ బంతి చేజారి కీపర్ దిశగా ఎగిరింది. అయితే చాలా అలర్ట్గా ఉన్న పంత్.. వెంటనే ఆ బంతిని డైవ్ చేసి పట్టుకున్నాడు. దీంతో షాంతో ఔట్ అయ్యాడు. 513 రన్స్ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా బ్యాటర్లు ఇవాళ ఉదయం భారత బౌలర్లను ఇబ్బందిపెట్టారు. తొలి వికెట్కు షాంతో, జకీర్ జంట 124 రన్స్ జోడించింది. అయితే ఇన్నింగ్స్ 47వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన బౌలింగ్లో షాంతో క్యాచ్ ఔట్ అయ్యాడు. కోహ్లీ క్యాచ్ వదిలేసినా.. పంత్ అందుకోవడంతో.. ఇండియన్ ప్లేయర్లు కాస్త రిలీఫ్ అయ్యారు.
A solid relay catch to break the solid partnership 🤯#TeamIndia gets the much-needed breakthrough courtesy of brilliant reflexes from @RishabhPant17 🙌#SonySportsNetwork #BANvIND@imVkohli pic.twitter.com/nbSfoMvhzd
— Sony Sports Network (@SonySportsNetwk) December 17, 2022