కోల్కతా: వికెట్ కీపర్ రిషబ్ పంత్కు కూడా బ్రేక్ ఇచ్చారు. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బయోబబుల్లో ఉన్న రిషబ్ పంత్కు బ్రేక్ ఇస్తున్నట్లు ఇవాళ బీసీసీఐ వెల్లడించింది. దీంతో వెస్టిండీస్తో జరిగే మూడవ టీ20 మ్యాచ్కు అతను దూరం కానున్నాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్కు కూడా రిషబ్ దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు ద్వారా తెలిసింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బయోబబుల్ నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. పంత్ శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్లో శరవేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే మంచి ఫామ్లో ఉన్న పంత్.. ఎందుకు బ్రేక్ తీసుకున్నాడో స్పష్టంగా తెలియదు.
శ్రీలంక సిరీస్ కోసం త్వరలో టీమిండియా జట్టును ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 24వ తేదీన లక్నోలో లంకతో తొలి టీ20 మ్యాచ్ జరగనున్నది. ఆ తర్వాత ధర్మశాలలో 26, 27 తేదీల్లో రెండు మ్యాచ్లు ఉంటాయి. ఇక మార్చి 4 నుంచి మొహాలీలో ఫస్ట్ టెస్ట్ జరుగుతుంది. మార్చి 12 నుంచి బెంగుళూరులో డే అండ్ నైట్ టెస్ట్ జరగనున్నది.