IND vs AUS : సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో భారత కుర్రాళ్లు తేలిపోయారు. దాంతో, రాయ్చూర్లో జరిగిన మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయడంతో రింకూ సింగ్(46 : 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేశాడు. టాపార్డర్లో రుతురాజ్ గైక్వాడ్(32), యశస్వీ జైస్వాల్(37 : 28 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్) మాత్రమే రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ మూడు, బెహ్రెన్డార్ఫ్ రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం లభించినప్పటికీ.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి వరుసగా ఒక్కొక్కరూ పెవిలియన్కు క్యూ కట్టారు. పవర్ ప్లే తర్వాత వరుసగా మూడు వికెట్లు తీసిన కంగారు బౌలర్లు భారత టాపార్డర్ జోరుకు అడ్డుకట్ట వేశారు. హర్డీ బౌలింగ్లో యశస్వీ(37) భారీ షాట్ ఆడి మెక్డెర్మాట్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్(8), సూర్యకుమార్ యాదవ్(1) పెవలియన్ చేరారు. ఆ తర్వాత రుతురాజ్, రింకూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీళ్లు నాలుగో వికెట్కు 48 రన్స్ జోడించడంతో, భారత్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.