IPL 2023 : టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) వికెట్ల వెనుక ఎంత చురుకుగా ఉంటాడో తెలిసిందే. స్టంపౌట్ చేయడం, గురిచూసి వికెట్లను కొట్టడమే కాకుండా చూడకుండా బంతిని విసిరి రనౌట్ చేయగల సమర్ధుడు అతను. అంతేకాదు ధోనీ రివ్యూ తీసుకున్నాడంతో అది కచ్చితంగా 99 శాతం అతడికి అనుకూలంగానే వస్తుంది. అందుకునే డీఆర్ఎస్(DRS)ను ధోనీ రివ్యూ సిస్టమ్ అంటుంటారు చాలామంది. ఐపీఎల్ పదహారో సీజన్లో అచ్చం ధోనీలానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీపర్ అనుజ్ రావత్(Anuj Rawat) ఒక రనౌట్ చేశాడు.
జైపూర్ స్టేడియంలో నిన్న రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అశ్విన్ను రావత్ ఔట్ చేశాడు. సిరాజ్ విసిరిన త్రోను అందుకున్న అతను వికెట్లను చూడకుండానే బంతిని సరిగ్గా వికెట్లమీదకు విసిరాడు. దాంతో,8వ వికెట్గా వచ్చిన అశ్విన్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో గెలిచింది.
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥
Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP
— IndianPremierLeague (@IPL) May 14, 2023
ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిని డూప్లెసిస్ సేన కీలక మ్యాచ్ల్ అదరగొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో గత సీజన్ రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ డూప్లెసిస్(55), ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్(54) అర్ధశతకంతో మెరిశారు. ఆఖర్లో అనుజ్ రావత్(29 నాటౌట్, 11 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్స్లు) దంచాడు. దాంతో, ఆర్సీబీ పోరాడగలిగే స్కరో చేసింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, అశ్విన్, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్ సున్నాకే వెనుదిరిగారు. హెట్మెయిర్ ఒక్కడే పోరాడాడు. పార్నెల్ మూడు, కరన్ శర్మ, మైఖేల్ బ్రేస్వెల్ రెండేసి వికెట్ల పడగొట్టరు. దాంతో, రాజస్థాన్ 59 పరుగులకే కుప్పకూలింది.