చెన్నై: ఐపీఎల్లో (IPL) భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్కతా నైట్రైడర్స్ (KKR) మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకున్నది. ఆదివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ (Chepauk) స్టేడియంలో ధోనీ (MS Dhoni) సేనకు ఇది చివరి మ్యాచ్ కావడంతో.. ఆట ముగిసిన అనంతరం జట్టు సభ్యులంతా మైదానంలో తిరుగుతు ప్రేక్షకులకు అభివాదం తెలుపుతున్నారు. ఇంతలో ఐపీఎల్ కామెంటేటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) పరుగున మైదానంలోకి వచ్చాడు. ధోనీ వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ (Autograph) ఇవ్వాలని కోరాడు. అదీ తాను వేసుకున్న అంగిపై (Shirt)..
దీంతో ఆశ్చర్యానికి లోనైన ధోనీ.. లిటిల్ మాస్టర్ను ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం అతను వేసుకున్న అంగిపై తన సంతకం చేశారు. అనంతరం ట్విట్టర్ వేదిక స్పందించిన గవాస్కర్ మిగిలిన మ్యాచ్లకు దయచేసి తనకు కొత్త పింక్ షెర్ట్ ఇవ్వండి అంటూ రాసుకొచ్చారు.
ఈ సీజన్లో చెపాక్లో ఆడిన చివరి మ్యాచ్లో నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలనుకున్న ధోనీ సేనపై కోల్కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శివమ్ దూబే (48 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు), కాన్వే (30) రాణించారు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో కోల్కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా (57 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్), రింకూ సింగ్ (54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు పడగొట్టాడు. చెన్నై బౌలర్ల ధాటికి ఒక దశలో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కోల్కతా కష్టాల్లో పడ్డా.. రింకూ, రాణా ఆదుకున్నారు. రింకూకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
𝙔𝙚𝙡𝙡𝙤𝙫𝙚! 💛
A special lap of honour filled with memorable moments ft. @msdhoni & Co. and the ever-so-energetic Chepauk crowd 🤗#TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/yHntEpuHNg
— IndianPremierLeague (@IPL) May 14, 2023
Now THAT'S what we call a wholesome moment 🥹❤️#IPLonJioCinema #IPL2023 #TATAIPL | @IPL @ChennaiIPL pic.twitter.com/DPlRj0eCrn
— JioCinema (@JioCinema) May 14, 2023