చెన్నై: కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా(Nitish Rana)కు 24 లక్షల జరిమానా విధించారు. చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో.. కేకేఆర్ జట్టు స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ వేసింది. దీంతో ఆ జట్టు కెప్టెన్కు ఫైన్ వేశారు. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయడంలో కేకేఆర్ విఫలమైంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద 24 లక్షల జరిమానా వేశారు. ఇక మిగితా ప్లేయర్లకు ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ ప్లేయర్కు కూడా ఫైన్ వేశారు. ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న చెన్నై జట్టు.. పాయింట్స్ టేబుల్లో టాప్ నాలుగు స్థానాల్లో నిలిచే అవకాశం ఉన్నది.
అంపైర్లతో వాగ్వాదం
కేకేఆర్ జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో.. కెప్టెన్ నితీశ్ రాణా అంపైర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. చివరి ఓవర్ సమయంలో.. భారీ స్క్రిన్పై నిర్ణీత సమయం దాటిపోయినట్లు డిస్ప్లే చేశారు. స్లో ఓవర్ రేట్ కొత్త రూల్స్ ప్రకారం సర్కిల్ బయట అయిదుగురికి బదులుగా కేవలం నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి. ఈ అంశంలో అంపైర్లతో రాణా వాగ్వాదానికి దిగారు. అయితే 145 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఈజీగా అందుకున్నది.
— Raju88 (@Raju88784482906) May 14, 2023