రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ బెయిర్స్టో (29 బంతుల్లోనే 66) అద్భుతమైన బ్యాటింగ్కు ధవన్ (21) మంచి సహకారం అందించాడు. అతను అవుటైన తర్వాత వచ్చిన రాజపక్స (1) నిరాశ పరిచాడు. అయితే ఆ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్స్టన్ (70) మరోసారి తను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. మయాంక్ అగర్వాల్ (19) భారీ స్కోరు చేయలేకపోయాడు.
అయితే చివర్లో హర్షల్ పటేల్, హసరంగ బంతితో చెలరేగారు. దాంతో జితేష్ శర్మ (9), హర్ప్రీత్ బ్రార్ (7), రిషి ధావన్ (7), రాహుల్ చాహర్ (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 4, హసరంగ 2 వికెట్లతో సత్తా చాటగా.. మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు.
Innings Break! @liaml4893 & @jbairstow21 hammered fifties to power @PunjabKingsIPL to 209/9. 👌 👌@HarshalPatel23 was the pick of the @RCBTweets bowlers. 👍 👍
The #RCB chase to commence soon. 🤔 🤔
Scorecard ▶️ https://t.co/jJzEACTIT1 #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/3knpV5oqxG
— IndianPremierLeague (@IPL) May 13, 2022