‘కేజీఎఫ్’.. ఐపీఎల్లో అత్యంత జనాదరణ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ అభిమాన ఆటగాైళ్లెన విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్లకు పెట్టుకున్న పేరు అది. ఈ ముగ్గురూ విడివిడిగా ఒక జట్టులో ఉంటేనే ప్రత్యర్థులకు ప్రమాదం అంటే.. కలిసి ఆడితే ఇంకేమైనా ఉందా..? ప్రపంచంలోని ఎంతటి మెరుగైన బౌలింగ్ టీమ్ అయినా ఈ బ్యాటింగ్ త్రయాన్ని ఢీకొట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. గత సీజన్లో ఈ ముగ్గురూ ఒకరిని మించి ఒకరు పరుగుల వరద పారించారు. వీళ్లకు తోడుగా మిడిలార్డర్లో రజత్ పాటిదార్ సైతం వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకున్నాడు. ఈ సీజన్కు ముందు రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను రూ.17.50 కోట్లు వెచ్చించి దక్కించుకున్నా అతడూ నాలుగు మ్యాచ్లలో తన మార్కును చూపలేదు. ఈ సీజన్లో కోహ్లీ తప్ప మిగిలిన ఆర్సీబీ టాపార్డర్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమవుతున్నారు.
IPL | 2024 సీజన్లో ఇప్పటిదాకా ఆర్సీబీ 4 మ్యాచ్లు ఆడగా టాపార్డర్లో ఒక్క కోహ్లీ తప్ప మిగిలిన బెంగళూరు బ్యాటర్లు అట్టర్ ప్లాఫ్ అవుతున్నారు. 2024లో 4 మ్యాచ్లలో కోహ్లీ.. 203 పరుగులు చేయగా మ్యాక్స్వెల్ (31), డుప్లెసిస్ (65), గ్రీన్ (63) కలిసి చేసింది 159 పరుగులే. కోహ్లీ మీద ఆర్సీబీ పరిమితికి మించి ఆధారపడుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం.
2008 నుంచి ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీ.. 2010 తర్వాత ఆడిన ప్రతి సీజన్లోనూ 300+ పరుగులు చేస్తూ ఆర్సీబీ బ్యాటింగ్కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఆర్సీబీ టాపార్డర్ వైఫల్యంపై కేకేఆర్తో మ్యాచ్లో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఇంకెంతకాలం ఆర్సీబీ కోహ్లీ మీద ఆధారపడుతుంది..? కోహ్లీ ఒక్కడే జట్టును ఎంతకాలమని లాక్కొని రాగలడు. ఎవరో ఒకరు అతడికి సహకరించాలి..’ అని వ్యాఖ్యానించాడు. చెన్నై మ్యాచ్లో ఫర్వాలేదనిపించినా పంజాబ్, కోల్కతాతో కోహ్లీ అర్ధ సెంచరీలతో ఆర్సీబీ గట్టెక్కింది. కానీ మంగళవారం లక్నోతో మ్యాచ్లో కోహ్లీ ఔట్ కాగానే డుప్లెసిస్, మ్యాక్స్వెల్, గ్రీన్ పెవిలియన్కు క్యూ కట్టారు.
2023 సీజన్లో డుప్లెసిస్, మ్యాక్సీ, పాటిదార్లు దుమ్మురేపినోళ్లే. డుప్లెసిస్ (14 మ్యాచ్లలో 730), మ్యాక్సీ (14 మ్యాచ్లలో 400), గ్రీన్ (ముంబై తరఫున ఆడుతూ 16 మ్యాచ్లలో 452) మైదానంలోకి వస్తే మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కానీ తాజా సీజన్లో ఈ ముగ్గురూ తమ ఆటతో బోర్ కొట్టిస్తున్నారు.