MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వార్త ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి పెట్టిన మహీ భాయ్ గౌరవార్థం.. అతడి జెర్సీ నంబర్ 7తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రత్యేక నాణేన్ని విడుదల చేయనుందనే వార్తలు తెగ తిరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అప్రతమత్తమైన రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఆర్థిక వ్యవహారాల విభాగం ధోనీ జెర్సీ నంబర్ 7తో నాణేన్ని విడుదల చేయడం లేదని.. మీడియాలో ప్రచారమవుతున్న వార్తలన్నీ అవాస్తమని తేల్చి చెప్పింది.
An image circulating on social media claims that a new ₹7 coin will be released to honor Mahendra Singh Dhoni for his contributions to Indian Cricket.#PIBFactCheck
✔️ The claim made in the image is #fake.
✔️ The Department of Economic Affairs has made NO such announcement. pic.twitter.com/rgFwmVUPbL
— PIB Fact Check (@PIBFactCheck) November 14, 2024
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)ను ఐదుసార్లు విజేతగా నిలిపిన మహీ భాయ్ 17వ సీజన్లో పగ్గాలు వదిలేశాడు. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)ను ప్రకటించి హుందాగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దాంతో, అతడు ఐపీఎల్ 18వ సీజన్లో అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడబోతున్నాడు. సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ మహీని రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది.
పదిహేడో సీజన్లో ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ రూ.12 కోట్లు ముట్టజెప్పింది. కానీ, ఇప్పుడు ధోనీ అన్క్యాప్డ్గా బరిలోకి దిగనున్నాడు. దాంతో, అతడి ఆదాయంలో రూ. 8 కోట్లు కోత పడనుంది. అన్క్యాప్ట్ ప్లేయర్ ఎవరైనా సరే వాళ్లకు రూ. 4 కోట్లు మాత్రమే ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో జరుగబోయే మెగా వేలంలో మ్యాచ్ విన్నర్లను కొనేందుకు సీఎస్కే యాజమాన్యం సిద్ధమవుతోంది.