IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్తో కొందరు స్టార్ ఆటగాళ్ల కెరీర్ ముగియనుంది. అంతేకాదు ఈ సీజన్తో కొన్ని ఫ్రాంచైజీల భావి కెప్టెన్ ఎవరు? అనేది కూడా తేలిపోనుంది. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు కొత్త కెప్టెన్ ఎవరు? అనేది కొన్ని రోజులుగా చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ మాజీ ఆటగాడు అంబటి రాయుడు(Ambati Rayudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈసారి చెన్నైకి ఇద్దరు కెప్టెన్లు ఉండే చాన్స్ ఉందని రాయుడు అన్నాడు. ఈసారి ధోనీ సారథ్య బాధ్యతలను పంచుకొనే అవకాశం ఉందని ఈ మాజీ క్రికెటర్ తెలిపాడు. ‘ఇంప్యాక్ట్ ప్లేయర్ నియమం ఉన్నందున ధోనీ ఎవరో ఒకరిని ఇన్నింగ్స్ మధ్యలో కెప్టెన్గా పంపే చాన్స్ ఉంది. ఇదే ధోనీకి ఆఖరి సీజన్ అయితే.. ఈ ఏడాది సీఎస్కేలో భారీ మార్పులు చూస్తాం. కానీ, ధోనీ మరికొన్నాళ్లు ఆడాలని అనుకుంటే మాత్రం అతడే కెప్టెన్గా కొనసాగుతాడు. ధోనీనీ సారథిగా చూడడం వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టం’ అని రాయుడు వెల్లడించాడు.
7 for reason ms dhoni…..❤️🔥💥#MSDhoni𓃵 💯🥂❤️🔥🥵#ipl csk
Chennai super kings ⚔️👑#waiting for March 22nd 😉
Do follow my twitter I’d
Mainly for the our prince. Sk Anna!! pic.twitter.com/DBy1Jkwtdl— Aakashraj (@Aakashraj639300) March 10, 2024
అంతేకాదు 17వ సీజన్ మొత్తం మహీ భాయ్ ఆడుతాడని రాయుడు అన్నాడు. 10 శాతం ఫిట్గా ఉన్నా సరే ధోనీ సీజన్ ఆసాంతం మైదానంలోకి దిగుతాడని చెప్పుకొచ్చాడు. ‘గాయాలు ధోనిని ఆటకు దూరం చేయలేవు. అతడు ఎన్నో సార్లు గాయాలతోనే ఆడాడు. నిరుడు కూడా మోకాలి గాయంతోనే మహీ బరిలోకి దిగాడు. అందుకని ఏ కారణం కూడా అతడిని ఈ సీజన్ మొత్తం ఆడకుండా అడ్డుకోలేదు’ అని రాయుడు చెప్పాడు.
Hey CSKians, I’ve Created A New Group In Twitter. Whoever Wants To Join In That Group.
Mention Your IDs Below In The Comment Section 💛#CSK #IPL2024 #Yellove #WhistlePodu pic.twitter.com/Ui1PeC75Su— என்றும் தலைவர் ரசிகன்ᴶᴬᴵᴸᴱᴿ💛 (@Rajini12Dhoni7) March 14, 2024
ఐపీఎల్లో చెన్నైని విజయవంతమైన జట్టుగా నిలిపిన ధోనీ ఈ ఏడాదితో ఈ మోగా టోర్నీకి వీడ్కోలు పలుకుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్లకు చాన్స్ ఇస్తారా? సీఎక్కే భావి కెప్టెన్ ఎవరు? అని అభిమానుల్లో చర్చ నడుస్తోంది. అయితే.. ధోనీ వారసుడిగా ఎవరిని ప్రకటించాలి? అనేదానిపై చెన్నై మేనేజ్మెంట్ స్పష్టతతో ఉంది. 17వ సీజన్ అనంతరం కెప్టెన్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్లు ఎవరిని ఎంపిక చేస్తే.. వాళ్లనే భావి సారథిగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మార్చి 22న జరిగే ఆరంభ పోరులో చెన్నై, రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొననుంది.