పుణె: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో.. న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లాథమ్ ఔటయ్యాడు. వ్యక్తిగతం 15 పరుగులు చేసి అశ్విన్(R Ashwin) బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అశ్విన్ తన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. తొలి వికెట్కు లాథమ్, కాన్వే 32 పరుగులు జోడించారు. తాజా సమాచారం ప్రకారం పుణె టెస్టు తొలి రోజు 14 ఓవర్లలో న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 49 రన్స్ చేసింది. ఇండియా మూడు మార్పులతో రెండో టెస్టుకు బరిలో దిగింది. కేఎల్ రాహుల్, సిరాజ్, కుల్దీప్ యాదవ్ స్థానంలో.. శుభమన్ గిల్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ జట్టులో చేరారు. బెంగుళూరులో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఓడిన విషయం తెలిసిందే.
LBW!
R Ashwin strikes in his very first over and gets the opening wicket for #TeamIndia 🙌
New Zealand lose Tom Latham’s wicket
Live – https://t.co/YVjSnKCtlI#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/CEYSAziZ3g
— BCCI (@BCCI) October 24, 2024