చాటోగ్రామ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు భోజన సమయానికి ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 348 రన్స్ చేసింది. అశ్విన్ 40, కుల్దీప్ యాదవ్ 21 రన్స్ తో క్రీజ్లో ఉన్నారు. ఇవాళ ఉదయం అయ్యర్ 86 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఎనిమిదో వికెట్కు అశ్విన్, కుల్దీప్లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరూ ఇవాళ ఉదయం 22 ఓవర్లలో 55 రన్స్ జోడించారు.
Lunch on Day 2 of the 1st Test.
After an early wicket, Ashwin & Kuldeep stitch a 55*-run partnership.#TeamIndia 348/7
Scorecard – https://t.co/GUHODOYOh9 #BANvIND pic.twitter.com/mkcYccH74H
— BCCI (@BCCI) December 15, 2022
తొలి రోజు ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 278 రన్స్ చేసిన విషయం తెలిసిందే. తొలుత టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(22), శుభ్మన్ గిల్(20) జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయారు. వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజార(90) పది పరుగుల తేడాతో సెంచరీ కోల్పోగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(1) ఘోరంగా నిరాశపరిచాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం టీమ్ఇండియా టాపార్డర్ను దెబ్బతీశాడు. ఐదో వికెట్కు పూజారా, అయ్యర్లు 149 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.