Ravichandran Ashwin : ఐపీఎల్ 16వ సీజన్లో ఉత్కంఠ పోరాటాలు ఫ్యాన్స్ను మునివేళ్ల మీద నిలబెడుతున్నాయి. ఆఖరి బంతి వరకు ఇరుజట్లను విజయం దోబూచులాడడం చూసి ఇది కదా అసలైన క్రికెట్ మజా అనుకుంటున్నారు చాలామంది. అయితే.. అంపైర్లపై రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంపైర్ల తీరును అతను తప్పు పట్టాడు. ఈ సీజన్లో అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు నాకు అర్థం కాలేదు. వాళ్ల ధోరణి చూసి షాకయ్యా అని ఈ సీనియర్ ఆల్రౌండర్ అన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో బుధవారం జరిగిన మ్యాచ్లో ఒక సంఘటనను అతను వివరించాడు. తేమ ఉందని చెప్పి అంపైర్లు తమకు తాముగా బంతిని మార్చడాన్ని అశ్విన్ తీవ్రంగా పరిగణించాడు. ఇలాంటి సంఘటనను తాను ఇంతకుముందు చూడలేదని, వాళ్లు అలా చేయడం చూసి ఆశ్చర్యపోయానని అతను మీడియా సమావేశంలో తెలిపాడు. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ 3 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది.
.@ashwinravi99 starred with bat & ball and bagged the Player of the Match awards as @rajasthanroyals beat #CSK to seal their 2⃣nd successive win. 👏 👏
Scorecard ▶️ https://t.co/IgV0Ztjhz8#TATAIPL | #CSKvRR pic.twitter.com/a9k5fp5lol
— IndianPremierLeague (@IPL) April 12, 2023
మొదట బ్యాటింగ్ చేసిన సంజా సేన 8 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. అశ్విన్ 30 రన్స్ కొట్టాడు. ఆ తర్వాత బౌలింగ్లో సత్తా చాటిన అతను కీలకమైన అజింక్యా రహానే, శివం దూబేలను ఎల్బీగా ఔట్ చేశాడు. చెన్నై కెప్టెన్ ధోనీ (32 నాటౌట్) క్రీజులో ఉన్నా కూడా జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా ఒక్క పరుగే వచ్చింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అశ్విన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.