Ravichandran Ashwin : ధర్మశాల టెస్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అదిరిపోయే ప్రదర్శన చేశాడు. కెరీర్లో వందో టెస్టు(100th Test)లో సూపర్ స్పెల్తో దిగ్గజాల రికార్డు బద్ధలు కొట్టాడు. టర్నింగ్ పిచ్పై అశ్విన్ 9 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ టాపార్డర్ను కూల్చి అరుదైన ఫీట్ సాధించాడు. వందో టెస్టులో ఐదు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు.
యశ్ కంటే ముందు అనిల్ కుంబ్లే ఈ ఫీట్ సాధించాడు. భారత లెజెండరీ స్పిన్నర్ అయిన కుంబ్లే 2005లో శ్రీలంకపై 89 రన్స్ ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. స్పిన్ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్, దివంగత స్పిన్నర్ షేన్ వార్న్లు సైతం నూరో టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టారు. 2002లో దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్టౌన్ టెస్టులో వార్న్ 6/161తో రాణించాడు. ఇక.. మురళీధరన్ విషయానికొస్తే బంగ్లాదేశ్పై 6/54తో విజృంభించాడు.
🚨 Record Alert 🚨
Most Five-wicket hauls in Test for India! 🔝
Take A Bow, R Ashwin 🙌 🙌
Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/0P2gQOn5HS
— BCCI (@BCCI) March 9, 2024
రెండో ఇన్నింగ్స్లో చెలరేగిన అశ్విన్.. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్(0), జాక్ క్రాలే(2) ఓలీ పోప్(19)లను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే సూపర్ డెలివరీతో బెన్ స్టోక్స్(2), బెన్ ఫోక్స్(8)లను బౌల్డ్ చేసి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, సుదీర్ఘ ఫార్మాట్లో 36సార్లు అశ్విన్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్ నడ్డి విరిచిన ఈ స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లే రికార్డు బద్ధలు కొట్టి..రిచర్డ్ హ్యాడ్లీతో సమానంగా నిలిచాడు. టెస్టుల్లో అత్యధికంగా 5 వికెట్లు తీసిన వాళ్లలో మురళీధరన్ సార్లు, షేన్ వార్న్లు టాప్లో కొనసాగుతున్నారు.
అశ్విన్, అనిల్ కుంబ్లే
నామమాత్రమైన ఐదో టెస్టులో భారత్ తొలి రోజు నుంచే పట్టుబిగించింది. టాపార్డర్ దంచి కొట్టడంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 477 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం అశ్విన్, బుమ్రా విజృంభణతో భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. అశ్విన్ స్పిన్ ఉచ్చులో ఇంగ్లండ్ ఆటగాళ్లు విలవిలలాడగా.. హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన జో రూట్(84) కుల్దీప్ యాదవ్ ఓవర్లో బౌండరీ వద్ద బుమ్రాకు దొరికాడు. దాంతో, ఇంగ్లండ్ 195 పరుగులకు కుప్పకూలింది. వరుసగా నాలుగో విజయంతో టీమిండియా 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, యశస్వీ జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు అందుకున్నారు.